Breaking News

భారత్ ముందు 328 పరుగుల విజయలక్ష్యం

0 0

బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 328 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. స్మిత్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా వార్నర్ (48), హారిస్ (38), గ్రీన్ (37) రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు దక్కించుకోగా వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ సాధించాడు. ఐదో రోజు వరుణుడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ డ్రా అయితే సిరీస్ డ్రా అవుతుంది. లేదా ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తే వారికి బోర్డర్-గవాస్కర్ సిరీస్ దక్కుతుంది.