Breaking News

భారత్‌లో తొలి టీకా తీసుకున్న వ్యక్తికి అలర్జీ

0 0

శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి అలర్జీ వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ సెక్యూరిటీ గార్డు మనీష్ కుమార్ తొలి టీకా తీసుకోగా అతడు ఎలర్జీ బారిన పడినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ‘ఎయిమ్స్‌లో తొలి టీకా తీసుకున్న మనీష్.. 15 నుంచి 20 నిమిషాల తర్వాత అలర్జీతో స్కిన్ రాషెస్ బారిన పడ్డాడు. వెంటనే అతడిని ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స చేశాం. అతని ఆరోగ్యం కుదుటపడింది. అయినా సరే ఎందుకైనా మంచిదని ఆ వ్యక్తిని రాత్రంతా ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. అతడు ఈ రోజు డిశ్చార్జ్ అవుతాడు’ అని గులేరియా వెల్లడించారు.