Breaking News

ఈనెల 29న ఓటీటీలో ‘క్రాక్’

1 0

రవితేజ, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘క్రాక్’ మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది. ఐదురోజుల్లోనే మంచి వసూళ్లను రాబట్టి లాభాల్లోకి దూసుకెళ్లింది. ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన ‘ఆహా’ జనవరి 29 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఎస్.తమన్ సంగీతం సమకూర్చాడు. ‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను ‘క్రాక్’ రాబట్టింది. కాగా రెండో వారం నుంచి ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శించనున్న థియేటర్ల సంఖ్య పెరగనుంది.