Breaking News

కోహ్లీ-అనుష్కశర్మ దంపతులకు ఆడబిడ్డ

0 0

భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మ సోమవారం నాడు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. తమపై అభిమానులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సందర్భంగా తమ ప్రైవసీని గౌరవించాలని అభ్యర్థించాడు. కాగా అనుష్కశర్మ డెలివరీ కోసం ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు ముగిశాక కోహ్లీ భారత్‌కు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లలో ఎక్కువ మందికి కూతుళ్లే జన్మించారు. ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, అజింక్యా రహానె, ఉమేశ్ యాదవ్, నటరాజన్‌లకు కూతుళ్లు పుట్టగా ఇప్పుడు కోహ్లీ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఆల్‌రౌండర్ పాండ్యాకు మాత్రం అబ్బాయి జన్మించాడు. సురేశ్ రైనాకు తొలుత అమ్మాయి జన్మించగా తర్వాత అబ్బాయి పుట్టాడు.

-->