Breaking News

యాక్టివాకు 2.5 కోట్ల మంది కస్టమర్లు

0 0

హోండా కంపెనీకి చెందిన యాక్టివా స్కూటర్ దేశంలో 2.5 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. దేశంలో తొలిసారి ఓ స్కూటర్ బ్రాండ్ ఈ మైలురాయిని చేరుకుందని హెచ్ఎంఎస్ఐ తెలిపింది. స్కూటర్లకు ఆదరణ తగ్గుతున్న రోజుల్లో 2001లో హోండా కంపెనీ తొలిసారి యాక్టివాను ప్రవేశపెట్టింది. అనంతరం మూడేళ్లలోనే స్కూటర్ సెగ్మెంట్‌లో యాక్టివా లీడర్‌గా అవతరించింది. 2008-09లో 110CC ఇంజిన్‌తో యాక్టివాను హోండా కస్టమర్లకు పరిచయం చేసింది. 2015లో మొత్తం కోటిమంది కస్టమర్లను యాక్టివా పొందింది. కాగా తర్వాతి ఐదేళ్లలోనే యాక్టివా స్కూటర్ 1.5 కోట్ల మంది కస్టమర్లను సంపాదించడం గమనార్హం.

-->