Breaking News

మారుతి దర్శకత్వంలో గోపీచంద్

0 0

‘ప్రతిరోజు పండగే’ తర్వాత విరామం తీసుకున్న దర్శకుడు మారుతి కొత్త సినిమాను లైన్‌లో పెట్టాడు. గోపీచంద్ హీరోగా ఆయన ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. గీతా ఆర్ట్ప్ 2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ త్వరలోనే విడుదల కానున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ‘సిటీమార్’షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా తమన్నా నటిస్తోంది. కాగా కొన్నేళ్లుగా గోపీచంద్‌కు సరైన హిట్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలపై అతడు గంపెడాశలు పెట్టుకున్నాడు.

-->