Breaking News

అసలు కేసీఆర్‌కు ఏమైంది?

0 0

సీఎం కేసీఆర్‌‌ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో మంట రావడంతో గురువారం మధ్యాహ్నం ఆయన టెస్టుల కోసం సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు కేసీఆర్ అనారోగ్యంపై మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది చేసే మెడికల్ టెస్టులే కేసీఆర్ ప్రస్తుతం చేయించుకున్నారని వివరణ ఇచ్చారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో సిటీ స్కాన్, ఈసీజీ, కొలెస్టరాల్, బ్లడ్, టూడీ ఏకో టెస్టులు నిర్వహించామని తెలిపారు. శుక్రవారం రిపోర్ట్ వస్తుందని, కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. కరోనా టెస్టు చేయగా నెగిటివ్ వచ్చిందన్నారు.

-->