Breaking News

CRICKET NEWS: మూడో టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే

0 0

గురువారం నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టుకు టీమిండియా తన తుదిజట్టును ప్రకటించింది. రెండు టెస్టుల్లో వరుసగా విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు చోటిచ్చింది. అటు ఉమేష్ యాదవ్ స్థానంలో అనుభవజ్ఞుడు నవదీప్ సైనీకే స్థానం కల్పించింది. ఈ రెండు మార్పులు మినహా బాక్సింగ్ డే టెస్టులో ఆడిన జట్టే సిడ్నీ టెస్టులో ఆడనుంది. వన్డేలు, టీ20ల్లో రాణించిన నటరాజన్ టెస్టుల్లో తుదిచోటు కోసం మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదు.

జట్టు: రహానె (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), పుజారా, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, హనుమా విహారి, రవీంద్ర జడేజా, అశ్విన్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

-->